జాగిత్యాల జిల్లా లో పాకిస్థాన్ ,ఆప్ఘనిస్థాన్ -ల సంచారం

జగిత్యాల జిల్లాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో అదుపులోకి తీసుకున్న వీరిని… పాకిస్థాన్ లేదా ఆప్ఘనిస్థాన్
కు చెందినవారిగా మొదట అనుమానించారు. వారిని ప్రశ్నించిన రాయికల్ పోలీసులు… ఐదుగురిలో ముగ్గురు ఆప్ఘనిస్థాన్ కు చెందినవారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పాస్ పోర్టుల ఆధారంగా.. నఖీముల్లా, వహీదుల్లా, అజహర్ లుగా గుర్తించారు. మిగతా ఇద్దరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని తెలుస్తోంది. కరీంనగర్ నుంచి.. టాటా సుమో వాహనంలో వచ్చిన ఈ ఐదుగురి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో… స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాయికల్ పోలీసులు వీరిని… స్టేషన్ కు తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. వారి పాస్ పోర్టులను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ