నిరుద్యోగ యూవతకు ఇతను ఆదర్శం
ప్రభుత్వ ఉద్యోగం చాలామంది కుర్రకారు కల... సాకారం కావాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే... సరదాలు మానాలి.. గంటలకొద్దీ పుస్తకాలకే అతుక్కుపోవాలి...లక్షలమందితో పోటీ పడి నెగ్గాలి... ఒక్క కొలువే గగనమైన ఈ రోజుల్లో ఏకంగా ఆరింటిని అవలీలగా సాధించాడు ఆదిలాబాద్ జిల్లా కుర్రాడు రాపెల్లి రాజశేఖర్. ఖానాపూర్కి చెందిన అమృత, ఎర్రన్నలు వ్యవసాయ కూలీలు. మా పిల్లలు మాలాగ కష్టపడొద్దని వాళ్ల తపన. చదువే అందుకు మార్గంగా కనపడింది. కన్నవాళ్ల కోరికను చిన్నప్పుడే అర్థం చేసుకున్నాడు రాజశేఖర్. క్షణం దొరికినా పుస్తకం వదిలేవాడు కాదు. ఆ కష్టం ఫలితాన్నిచ్చింది. పదోతరగతిలో పాఠశాలలో ప్రథముడిగా నిలవడంతో రాజశేఖర్లో ఏదైనా సాధించొచ్చనే ఆత్మవిశ్వాసం పెరిగింది. ఓ ప్రైవేటు కళాశాల ఉచిత భోజన, వసతి కల్పించడంతో పట్టుదలగా చదివి నిర్మల్ పట్టణ టాపర్గా నిలిచాడు. 84 శాతం మార్కులతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అదే జోరుతో ‘గేట్’ రాస్తే జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు వశమైంది. డిగ్రీ పట్టా చేతికందగానే కొలువుల వేట ప్రారంభించాడు రాజశేఖర్. 2010లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మొదటి ఉద్యోగం కొట్టి ఖాతా